
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవి రేసులో సమీకరణలు ఆశ్చర్యకరమైన రీతిలో శరవేగంగా మారుతున్నాయి. ఆ పదవి కోసం సీనియర్ నేతలు వి.హన్మంతరావు, జానారెడ్డి, సురేష్రెడ్డి, మల్లు రవి, నందిఎల్లయ్య పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, హటాత్తుగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మబంధువయిన రాజ్యసభ ఎంపి డాక్టర్ కెవిపి రామచంద్రరావు పేరు తెరపైకి రావడంతో సీను ఆసక్తికరమైన మలుపు తిరిగింది. తనకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే.. రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దుతానని కేవీపీ మంగళవారం సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్పటేల్ను ఢిల్లీలో కలసి అభ్యర్ధనా పూర్వకంగా హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ సందర్భంగా వారిద్దరూ రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. జగన్ పరిణామాల వల్ల రాష్ట్ర కాంగ్రెస్ అస్తవ్యస్థంగా మారిందని, దానివల్ల ప్రతిపక్షానికి లాభంగా మారుతోందని కేవీపీ చెప్పినట్లు తెలిసింది. అందువల్ల రాష్ట్రంలో పార్టీ పూర్తిగా దెబ్బతినకుండా ఉండాలంటే అటు పార్టీకి, ఇటు ముఖ్యమంత్రి రోశయ్య- జగన్కు అనుసంధానకర్తగా వ్యవహరించి పార్టీని కాపాడే అవకాశం తనకు ఇవ్వాలని ఆయన కోరినట్లు సమాచారం. దీనిపై అహ్మద్పటేల్ కూడా సానుకూలంగా స్పందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలపై రోశయ్య, జగన్ కంటే.. ఇప్పటికీ రామచంద్రరావుకే పట్టు ఎక్కువగా ఉన్న విషయాన్ని కూడా నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది.

ముగ్గురి మధ్య సమన్వయం కుదర్చడంతో పాటు.. పార్టీ ఆర్థిక అవసరాలు కూడా తీర్చడంలో కేవీపీ సేవలను వినియోగించుకోవాలన్న యోచనలో నాయకత్వం కూడా ఉన్నట్లు పార్టీ నేతలు చెబు తున్నారు. వైఎస్ ఉండగా, అలాంటి అవసరాలు తీర్చడం, నిధుల విషయంలో సమన్వయం కుదర్చడంలో విజయ వంతమైన పాత్ర పోషించిన కేవీపీ ముగ్గురికీ అనుకూల మైన వ్యక్తిగా అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు విశ్లేషి స్తున్నాయి. నిజానికి.. కేవీపీ లక్ష్యం ‘మరొకటి’ అయినా దానికంటే ముందు పీసీసీ అధ్యక్ష పదవి తొలి మెట్టు అని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
అందుకే ఆయన పీసీసీ పీఠంపై కన్నేసినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని.. రోశయ్య- జగన్కు అనుకూలంగా వ్యవహరించడం కూడా ‘తన సుదీర్ఘ లక్ష్యాన్ని’ సాధించుకు నేందుకేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇప్ప టికే సీఎం రోశయ్య కోస్తా నుంచి ప్రాతినిధ్యం వహిస్తు న్నందున మళ్లీ అదే ప్రాంతానికి చెందిన కేవీపీని ఎలా నియమిస్తారన్న ప్రశ్నలు పార్టీలోని మరో వర్గం నుంచి వినిపిస్తున్నాయి. ‘అలాగయి తే, రోశయ్యను మార్చి ఆయ న స్థానంలో తెలంగాణకు చెందిన నేతకు సీఎం పదవి ఇవ్వాలి. అప్పుడే సరైన సమీ కరణలు సాధించినట్టు ఉంటుంద’ని తెలంగాణకు చెందిన ఓ ఎంపి వ్యాఖ్యా నించారు. ఒకవేళ కేవీపీని పీసీసీ అధ్యక్షు డిగా నియమిస్తే ప్రాంతాల సమీకరణలో భాగంగా.. ఇప్పటికే కోస్తా నుంచి సీఎంగా ఉన్న రోశయ్యను మార్చక తప్పదని పార్టీ సీనియర్లు సైతం స్పష్టం చేస్తున్నారు.
No comments:
Post a Comment