Tuesday, August 31, 2010

అయిననూ.. పోయిరావలె... !

YS-Jagan
స్వయంగా అధిష్ఠానమే బాధిత కుటుంబాలను ఓదార్చేందుకు సిద్ధమవుతున్నప్పటికీ.. జగన్‌ మాత్రం తన వైఖరిని సడలించుకునేందుకు ఇష్టప డటం లేదు. బాధిత కుటుంబాలకు లక్ష రూపా యల చొప్పున ఇవ్వడంతో పాటు.. ఆ గుర్తింపు ప్రక్రియను కూడా పార్టీ నాయకత్వమే చేపట్టడం ఆసక్తికలిగిస్తోంది. జగన్‌ లెక్కలు తప్పుడువన్న సంకేతాలు పంపేందుకే నాయకత్వం ఈ ఎత్తుగడ దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నా యకత్వం బాధితులను తానే ఓదార్చాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జగన్‌ తన యాత్రను విర మించుకునే యోచనకు బదులు.. మరింత పకడ్బందీగా ఓదార్పును యధాతథంగా కొనసా గించాలని నిర్ణయించుకున్నారు.

వీరప్ప మొయిలీ ప్రకటనపై వెనుకడుగు వేయని జగన్‌ తన ప్రకాశం జిల్లా యాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో వెనుకడుగు వేస్తే అప్రతిష్ట పాలవుతామని, నాయకత్వానికి పూర్తిగా లొంగిపోయారన్న సంకేతాలు వెళతా యన్న భావన ఆయనలో స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా, పార్టీ నాయకత్వమే బాధిత కుటుంబా లను ఓదార్చాలన్న నిర్ణయాన్ని అభినందిస్తూ జగన్‌ పార్టీ అధినేత సోనియాగాంధీకి లేఖ రాయడం చర్చనీయాంశమయింది. అందులో ఒకవైపు పార్టీ నాయకత్వాన్ని అభినందిస్తూనే, మరోవైపు పరోక్షం గా అనేక రకాల ఎత్తిపొడుపులకు తెరలేపారు.

ఆ లేఖలో జగన్‌ తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. ఇన్నాళ్లూ వైఎస్‌ మృతి వార్తతో ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలను అపహాస్యం చేసి, అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన వారివి తప్పుడు మాటలేనని అధిష్ఠానం ఇన్నాళ్లకయినా గుర్తించిందంటూ పరోక్షంగా ఎత్తిపొడిచారు. పార్టీ పక్షాన ఓదార్పు యాత్ర నిర్వ హించేందుకు వచ్చే వారు తనతో రావాలని, ఆ విధంగానే వస్తేనే పార్టీ తలపెట్టిన కార్యక్రమానికి పరిపూర్ణత చేకూరుతుందని స్పష్టం చేశారు.

బాధితులకు డబ్బు ఇవ్వడం ఒక్కటే ముఖ్యం కాదని, వారి ఇళ్లకు వెళ్లి పలకరించి, పరామర్శిం చడం మన సంప్రదాయమని స్పష్టం చేశారు. అంటే... తాను చేస్తున్నది మాత్రమే సంప్రదా య మని, పార్టీ చేస్తున్నది సంప్ర దాయం ఎంత మాత్రం కాదని స్పష్టం చేసినట్ట యింది. అదేవి దంగా వైఎస్‌ మరణవార్త విని, టీవీల్లో చూసి మృతి చెందిన పార్టీ కార్యకర్త లకూ ఏఐసిసి ప్రకటించిన సాయం వర్తిం పచేసి ఉంటే బాగుండేదని వ్యా ఖ్యానించడం ద్వారా.. బా దితుల గుర్తింపులో ఏఐ సిసి నిర్వహించే ప్రక్రి య లోపాలను జగన్‌ పరో క్షంగా ఎత్తిచూపినట్ట యిం ది. తాను ఆవిధంగా సా యం చేస్తున్నందున పార్టీ కూడా అదే పద్ధతిలో సా యం చేయాలని జగన్‌ చెప్పకనే చెప్పారు.

No comments:

Post a Comment