రాష్ట్ర కాంగ్రెస్లో రెండు శిబిరాల మధ్య దాడి... ఎదురు దాడి జరుగుతోంది. ప్రత్యేకించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్రెడ్డి కుమారుడు, కడప ఎంపి జగన్మోహన్రెడ్డి నిర్వహి స్తున్న ఓదార్పు యాత్ర ఈ రెండు శిబిరాల మధ్య యుద్ధ వాతావర ణానికి నాంది పలుకుతోంది. పార్టీ నేతలు జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోరుు పోరు తీవ్రతరం చేశారు. పార్టీ అధిష్ఠానాన్నే లెక్క చేయని రీతిలో జగన్ వర్గం వ్యవహరిస్తుండగా, హైకమాండ్గ ఆదేశాలే మాకు శిరోధార్యమంటూ జగనే టార్గెట్గా వ్యతిరేక వర్గం ఎదురు దాడికి దిగు తున్నది. ఓదార్పు యాత్రే కాంగ్రెస్లో కల్లోలానికి దారి తీస్తున్నది. పార్టీ శ్రేణుల్లో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది.

పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఎవరు కూడా ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దని సోనియా, అహ్మద్ పటేల్ చెప్పారంటూ కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఢిల్లీలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ తరువాత ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. మరో వైపు ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్రావు కూడా జగన్ ఓదార్పు యాత్ర విషయంలో కామెంట్లు చేశారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో దగ్గుబాటి దంపతులు ఓదార్పు యాత్ర ఎపిసోడ్లో వ్యవహరించిన పాత్ర యువనేత జగన్కు అగ్రహాన్నే తెచ్చిపెట్టింది. ఆయన అనుచరగణం కూడా దగ్గుబాటి దంపతులపై ఎదురు దాడికి దిగారు.

ఇలా ఉండగా జగన్ వర్గం నేతలు కూడా దగ్గుబాటి దంపతుల నిప్పులు చెరుగుతున్నారు. ఓదార్పు యాత్ర విషయంలో పార్టీ అధిష్టానం ఏదైనా చెప్పా ల్సి ఉంటే నేరుగా జగన్నే పిలిపించి చెప్పవచ్చు, అలా కాకుండా తమతో సోనియా, పటేల్ చెప్పారంటూ దగ్గుబాటి దంపతులు జగన్ ఓదార్పు యాత్ర ను అడ్డుకునే రాజకీయాలు చేస్తున్నారంటూ పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అదే విధంగా జగన్ వర్గ నాయకు లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్రావు, పార్టీ నేత గట్టురామచంద్ర రావు తది తరులు కూడా దగ్గుబాటి దంపతులపై చిందులు తొక్కారు.
ఎన్టీఆర్ను గద్దె దించడంలో కీలక పాత్ర వహించారంటూ దగ్గుబాటి వెంకటేశ్వర్రావు మండి పడ్డారు. మరో వైపు తిరుపతిలో ఉన్న జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కూడా ఓదార్పు విషయంలో పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావు అతిగా స్పందించారంటూ ఢిల్లీలో వారు వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో దగ్గుబాటి దంపతులు కీలక పాత్ర పోషించిన దాఖలాలు లేవని, పదవులు కాపాడుకోవడానికే కొందరు జగన్ను టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇక మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరో అడుగు ముందుకు వేసి మంత్రి పదవులు తనకు శాశ్వతం కాదని, అధిష్ఠానం వద్దన్నా తాను ఓదార్పు యాత్రకు వెళ్ళి తీరుతానని మరో సారి పునరుద్ఘాటించి జగన్కు విధేయతను ప్రకటించుకున్నారు.
ఎదురుదాడి....
ఇదిలా ఉండగా జగన్ వ్యతిరేక వర్గం అతనిపై ఎదురు దాడి ప్రారంభిం చింది. అధిష్ఠానం ఆదేశాలను సైతం లెక్క చేయకుండా, పార్టీని శాసించే స్థా యిలో జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ఆ వర్గం కన్నెర్ర చేస్తున్నది. రోజు వారిగా జగన్పై విమర్శలు సంధిస్తున్న నేతలతో పాటు శుక్రవారం ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంత రావు తదితరులు జగన్ పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా అతనిపై బాణాలు ఎక్కుపెట్టారు. ఈ ముగ్గురు నేతలు కూడా రాజీవ్ జయంతి వేడుకల కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని జగన్పై తమదైన శైలీలో మండిపడ్డారు. నిజమైన నాయకులు ఎవరూ కూడా పదవుల కోసం పాకులాడరంటూ ముఖ్య మంత్రి రోశయ్య చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జగన్ను ఉద్దేశించి మాట్లాడిన వేనని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా పీసీసీ చీఫ్ డిఎస్ కూడా యుననేత జగన్పై గురిపెట్టి కొందరు నేతలు పార్టీలో కాలుమోపగానే పదవు ల కోసం పోటీ పడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, రాహుల్ గాంధీని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని హితవు పలికారు. మరో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విహెచ్, జగన్ పేరు ప్రస్తావించకుండానే నాడు రాజీవ్ గాంధీ ఆశీస్సుల వల్లే వైఎస్కు పీసీసీ అధ్యక్ష పదవి దక్కిందని, రాజీవ్ లేక పోతే వైఎస్కు ఆ పదవి వచ్చేదా? అని ప్రశ్నించారు. అంబేద్కర్ కాదు, గాంధీ కాదు, అంతా మా నాన్నేనని కొందరంటున్నారు, అది సరికాదు, పార్టీకి సేవచేయకుండా పదవులు ఎలా వస్తాయి? హైకమాండ్ను నమ్ముకుంటేనే పదవులు వస్తాయన్న విషయాన్ని అందరు గ్రహించాలని ఆయన జగన్కు చురకలంటించారు. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి శంకర్రావు కూడా ఓదార్పు యాత్ర వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, జగన్ చుట్టు ఉన్న నేతలందరు నీళ్ళ తరహాలాంటి వారేనంటూ జగన్ వర్గంపై ధ్వజమెత్తారు.
No comments:
Post a Comment