Sunday, September 5, 2010

సోనియా నంబర్‌ వన్‌


SONIA-MaM
ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ భారతదేశంలో మొదటి పార్టీ. దేశానికి ఎక్కువ మంది ప్రధానులను అందించింది. రాజకీయ చదరంగంలో అన్ని కళలు తెలిసిన నాయకులకు జన్మనిచ్చింది. బ్రిటిష్‌ చెరలో ఉన్న జాతి సంకెళ్లను తెంచింది. ఐఎన్‌సి ను స్థాపించింది విదేశీయుడైన ఏ. ఓ. హ్యుం. అయితే ఆయన ఏనాడు పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టలేదు. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు ఇప్పటివరకు ఐదుగురు మహిళలు అధ్యక్షులుగా పనిచేశారు. వారిలో విదేశీయులే ఎక్కువగా ఉండటం విశేషం. ఇప్పటివరకు ఉన్న అందరి నాయకుల్లో కాంగ్రెస్‌ అధ్యక్షపీఠంపై ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన రికార్డు మాత్రం సోనియాగాంధిదే. అంతేకాదు ప్రధాని పదవిలో లేకుండా పార్టీ పగ్గాలను ఇంతకాలం చేపట్టిన వ్యక్తిగానూ ఆమె చరిత్రను సృష్టించింది.

ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పీఠాన్ని అధిరోహించిన వ్యక్తులు...
ఆచార్య జె.బి కృపలాని: ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కు 1947నవంబర్‌లో మొదటి అధ్యక్షుడిగా ఎన్నికైయారు. పార్టీలో ఏర్పడిన అంతర్గత వైషమ్యాలతో కలత చెంది 1951లో ఆయన కాంగ్రెస్‌ పార్టీని విడిచి క్రిషక్‌ మజ్ధూర్‌ ప్రజా పార్టీని స్థాపించారు. ఆనతి కాలంలోనే దీన్ని ప్రజా సోషలిస్ట్‌ పార్టీలో విలీనం చేశారు.

sonia-gandh
పురుషోత్తం దాస్‌ టాండన్‌:  అలహాబాద్‌లో 1882,ఆగష్టు1న జన్మించారు. 1899లో ఐఎన్‌సిలో విద్యార్థిగా చేరారు. 1950లో అధ్యక్షుడైయారు. మహాత్మాగాంధీ ఆయన్ని రాజర్షి అని ిపిలిచేవారు.
జవహర్‌లాల్‌ నెహ్రూ: భారత తొలి ప్రధాని. ఆ పదవిలో ఎక్కువ కాలం పనిచేసిన ఘనత వహించారు. ప్రధానమంత్రిగా ఉంటూనే కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన మొదటివ్యక్తిగా నెహ్రూ చరిత్రకెక్కారు. ఆ సంస్కృతికి బీజం వేసింది ఈయనే. చాచాజీ దేశానికి స్వాతంత్య్రం రాకమునుపు ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌కి అధ్యక్షుడిగా 1929లో పనిచేశారు.

యు.ఎన్‌. దేబర్‌:1941లో గాంధీ పిలుపు మేరకు సత్యాగ్రహంలో పాల్గొన్న యు. ఎన్‌. దేబర్‌ 1955లో కాంగ్రెస్‌ అధ్యక్షపీఠానికి ఎన్నికైయారు. 1958 వరకు పదవిలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోని ప్రధాన నాయకులందరినీ ఓ చోట చేర్చి మొదటి సమావేశాన్ని నిర్వహించిన ఘనత ఇతనిదే.
ఇందిరాగాంధీ: దేశానికి తొలి మహిళా ప్రధాని. ఐరన్‌లేడీగా ఖ్యాతి. సంక్షేమపథకాల రూపశిల్పి. 1959లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైయ్యారు. రెండవ దఫా 1978 నుండి ఆమె మరణించేవరకు ఆ పదవిలో ఉన్నారు. నెహ్రూ తరవాత ప్రధానమంత్రిగా ఉంటూనే అధ్యక్షపీఠం ఉన్న వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు.
కె. కామరాజ్‌: నెహ్రు మరణానంతరం 1969లో చీలిపోయిన కాంగ్రెస్‌ పార్టీని పటిష్టపరిచాడు. అక్టోబర్‌ 9, 1963లో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైయారు. 1967వరకుపదవిలోన్నారు.1954లో మద్రాస్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

sonia
ఎస్‌ నిజలింగప్ప:  1968లో ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటికి అధ్యక్షులుగా ఎన్నికైయారు. కర్ణాటక పితామహుడుగా పిలుచుకునే నిజలింగప్ప ముఖ్యమంత్రిగా కూడా చేశారు.
జగజ్జీవన్‌ రామ్‌: షెడ్యూల్‌ కులాల కోసం 1935లో ప్రత్యేక చట్టానికి ప్రవేశపెట్టిన బాబూ జగజ్జీవన్‌ రామ్‌ 1970లో అధ్యక్షపీఠానికి ఎన్నికైయారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు.
శంకర్‌ దయాళ్‌ శర్మ: 1972లో ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైయారు. మూడు సంవత్సరాల పాటూ ఆయన పదవిలో కొనసాగారు.

దేవ్‌ కాంత్‌ బారువా: 1974లో కాంగ్రెస్‌ అధ్యక్షపదవికి ఎన్నికైయారు. 1977 వరకు ఉన్నారు. ఎమర్జెనీ సమయంలోనూ ఆయన అధ్యక్షుడిగా కొనసాగారు.

రాజీవ్‌గాంధీ: ఇందిరా మరణానంతరం ప్రధాని పదవిని చేపట్టిన రాజీవ్‌గాంధీ 1985లో ఏఐసీసీకి అధ్యక్షుడిగా ఎన్నికైయారు. ప్రధాని పదవిలోనే ఉంటూ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన మూడోవ్యక్తి రాజీవ్‌.
సీతారాం కేసరి: 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుటు స్వాతంత్య్రం కోసం పోరాడిన సీతారాం కేసరి 1996 - 1997 ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.

సోనియాగాంధీ:
ఇందిరాగాంధీ తరవాత మళ్లీ ఓ మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షపీఠాన్ని అధిరోిహంచింది. అంతేకాదు విదేశీ సంతతికి చెందిన వ్యక్తిగా సోనియా 1998లో అధ్యక్షపదవిని చేపట్టింది. మొదట్లో రాజకీయాలకు చాలా దూరంగా ఉన్న సోనియా భర్త మరణం తరవాత కాంగ్రెస్‌ నాయకుల ఒత్తిడితో రాజకీయాల్లోకి ప్రవేశించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దేశంలో వరసగా రెండుసార్లు ఏర్పాటు చేయటంలో ఆమెదే కీలకపాత్ర.

తెలుగువెలుగులు

prmukulus
కాంగ్రెస్‌ పార్టీలో గాంధీజీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన తెలుగువాడు శ్రీ భోగరాజు పట్టాభిసీతారామయ్య.. 1948లో జరిగిన ఎన్నికల్లో పురుషోత్తమ్‌ టాండన్‌పై గెలిచి భారతీయ జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగువాడుగా చరిత్ర సృష్టించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి 1960లో అధ్యక్షుడైయారు. 1929లో జాతిపిత ఆదేశం మేరకు స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్న నీలం ఆనతికాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి స్థాయికి ఎదిగారు.ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర వహించారు. 1960లో జరిగిన ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు.

prmukulu
రాజ్యసభ్య సభ్యుడిగా లాల్‌ బహుదూర్‌ శాస్ర్తి, ఇందిరా గాంధీ ప్రభుత్వంలో పనిచేశారు. 1957లో హిందూపురం నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికైన నీలం లోక్‌సభ స్పీకర్‌గా కూడా పనిచేశారు. 1977 - 82 వరకు దేశానికి 6వ రాష్టప్రతిగా కూడా పనిచేశారు. వీరీరూవురి తరవాత దేశానికి తొలి తెలుగు ప్రధానమంత్రి (1991 - 96) అయిన పీ. వీ నరసింహారావు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా 1992లో ప్రధానమంత్రి పదవీలో ఉండగా ఎన్నికైయ్యారు. పీ.వీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 1971, 73లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రమంత్రిగానూ (1984 - 95) పనిచేశారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన ప్రధానిగా ఆయన వినుతికెక్కారు.

No comments:

Post a Comment