Monday, November 15, 2010

వృద్ధాప్యంలోనూ... ఉడుంపట్టు

వృద్ధాప్యంలోనూ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరిపాలనపై ఉడుంపట్టు బిగిస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా.. దేశంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రు లను మార్చేందుకు నాయకత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో.. అధినేత్రి అంతరంగాన్ని గమ నించిన రోశయ్య నాయకత్వం మదిలో ఎలాంటి ‘కొత్త ఆలోచనకు అవకాశం కలిగించకుండా’ వేగంగా పనిచేయడం ప్రారంభించారు. తన పని తీరు ద్వారా అటు మంత్రులనూ పరిగెత్తిస్తూ ఆంధ్ర్ర పదేశ్‌లో మార్పులకు అవకాశం ఉం దన్న వార్తలు, జోస్యాలను కొట్టిపారేసే కార్యాచరణలో నిమగ్న మయ్యారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఖాయ మన్న ఊహాగానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రోశయ్య తన పాత వైఖరి మార్చుకుని, ధృడంగా వ్యవహరిస్తుండటం, చర్చనీయాంశమయింది.

‘ఢిల్లీ వాతావరణాన్ని’ గమనిస్తున్న ఆయన, ఆ మేరకు పాలనపై ఉడుంపట్టు బిగిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ తానో దారినపోయే దానయ్యనని, అధిష్ఠానం ఆదేశాల మేరకు పనిచేస్తానని, తనకె లాంటి కోరికలు లేవని, అధిష్ఠానం ఉండమన్నంత వరకూ ఉంటానని, తనకు ఎలాంటి ఉద్యోగం ఇచ్చినా చేస్తానంటూ తామరాకుపై నీటిబొట్టు చందంగా వ్యవహరించిన రోశయ్య.. ఈమధ్య కాలంలో చురుకుగా, స్వతంత్రంగా ‘తన ప్రభు త్వం తప్పనిసరిగా పూర్తికాలం కొన సాగుతుందన్న’ సంకేతాలిచ్చేలా వ్యవహరిస్తున్నారు. అందులో భాగం గా ఆయన తన వయసును కూడా లెక్కచేయకుండా జిల్లా పర్యటనలు చేస్తున్నారు.
cm-speech
రోశయ్య సగటున వారా నికి మూడు పర్యటనలు, 18-20 సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈనెల 14 నుంచి 24 వరకూ వరసగా పర్య టనలు ఉన్న విషయం తెలి సిందే. రోశయ్య మార్పు ఖాయమని, తెలం గాణకు చెందిన నాయకుడికి పగ్గాలు అందిస్తారన్న ఊహా గానా లతో మంత్రులు సైతం చాలాకాలం నుంచి ఎవరికీ పట్టనట్లు వ్యవ హరించారు. చివరకు తనపై ప్రతిపక్షాలు విమ ర్శలు చేసినా ఎదురుదాడి చేయ కుండా మౌనంగా ఉంటున్న వైనంపై రోశయ్య కొరడా ఝళిపించడంతో, గత కొద్దిరోజుల నుంచి మంత్రులు పోటీలు పడి మరీ ప్రధాన ప్రతిపక్ష మైన టీడీపీపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నారు. కొద్దిమంది ఎమ్మె ల్యేలు కూడా మంత్రులను అనుసరిస్తున్నారు.

ఇటీవల ఏడు జిల్లాల్లో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో జిల్లాల పర్యటనలకు మంత్రులను అప్రమత్తం చేయగలి గారు. ఇదే రోశయ్య సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన భారీ వరదల సమయంలో మంత్రులు నిర్లిప్తంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇవన్నీ రోశయ్య తన పాల నను మరింత పటిష్ఠం చేసుకునేం దుకు ప్రయత్నిస్తున్న సంకేతాలను స్పష్టం చేస్తున్నాయి. ఇక తాజాగా, పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై ఆరె స్సెస్‌ మాజీ అధినేత సుదర్శన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలు ఖండిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.

అయితే.. అందరి కంటే భిన్నంగా ముఖ్యమంత్రి రోశ య్య మాత్రం రాష్ట్ర కాంగ్రెస్‌ నిర్వ హించిన ధర్నాలో స్వయంగా పాల్గొ ని సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఏ రాష్ట్ర ముఖ్య మంత్రీ కూడా ఈవిధంగా రోడ్డుపె ైకొచ్చి పార్టీ అధినేత్రికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్న దాఖ లాలు లేవు. ఇది జాతీయ స్థాయి లోనూ చర్చ నీయాంశంగా మారి రోశయ్య అందరి దృష్టినీ ఆకర్షించ గలిగారు. రోశయ్య ధైర్యంగా తీసు కున్న ఈ నిర్ణయం పార్టీ అధ్యక్షు రాలికి ఆయనను మరింత చేరువ చేసింది.

రోశయ్య.. పార్టీ ఎమ్మెల్యేల ప్రయోజనాలు పరిరక్షిస్తున్నానన్న సంకేతాలివ్వడం కూడా ప్రారంభించారు.నామినేటెడ్‌ పదవుల విష యంలో జిల్లా మంత్రులు పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం తప్పని సరిగా తీసుకోవాలని, వారి నియోజక వర్గాల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనల సందర్భంగా తనకు వ్యతి రేకంగా చేసిన వ్యాఖ్యలపై రోశయ్య విరుచుకుపడ్డారు. ఆయన చేసిన ఎదురు దాడి తీరు.. తాను బలహీన ముఖ్యమంత్రిని కాదన్న సంకేతాలి చ్చాయి. అప్పటి వరకూ తాను ప్రతి పక్షం జోలికి పోకుండా, లౌక్య పరమైన రాజకీయాలు చేస్తున్నాననే విమర్శలకు తెరదింపగలిగారు.

ధర్నా విషయం చూడటానికి సాధార ణంగా కనిపించినప్పటికీ.. తాను పార్టీ కోసం దేనికయినా సిద్ధంగా ఉన్నానన్న సంకేతాలతో పాటు.. పార్టీ అధినేత్రి దృష్టిలో విశ్వస నీయత, విధేయత గల ఏకైక ముఖ్యమంత్రి అన్న భావన కల్పిం చడంలో రోశయ్య విజయం సాధిం చగలిగారు. తాజాగా సోని యాకు మద్దతుగా చేసిన ధర్నా, ప్రతి పక్షంపై ఎదురుదాడి పరిణామాలతో రాష్ట్రం లో నాయ త్వ మార్పు చేయవలసిన అవసరం లేదన్న సంకేతాలను రోశయ్య అధిష్ఠానానికి స్పష్టంగా పంపగలిగారు.

No comments:

Post a Comment